లాతూర్ నగర హాస్టల్‌లో 44 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-03-12T14:26:45+05:30 IST

కరోనా మహమ్మారి మహారాష్ట్రలోని లాతూర్ నగరాన్ని వణికిస్తోంది....

లాతూర్ నగర హాస్టల్‌లో 44 మందికి కరోనా

లాతూర్ (మహారాష్ట్ర): కరోనా మహమ్మారి మహారాష్ట్రలోని లాతూర్ నగరాన్ని వణికిస్తోంది. లాతూర్ నగరంలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఓ హాస్టల్లో 44 మందికి కరోనా సోకింది. గురువారం  లాతూర్ నగరంలోని ఎంఐడీసీ ప్రాంతంలోని హాస్టల్లో జరిపిన కరోనా పరీక్షల్లో 44 మందికి పాజిటివ్ అని రావడంతో కలవరం ఏర్పడింది.గతంలో ఇదే హాస్టల్ లో 47 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా ప్రబలిన హాస్టల్ ఇంగ్లీషు మీడియం స్కూలుకు సమీపంలోనే ఉండటంతో పాఠశాల విద్యార్థులకు కూడా కరోనా ప్రబలవచ్చని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.44 మంది విద్యార్థులను హాస్టల్ నుంచి క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.ఒక్కరోజే లాతూర్ నగరంలో 146 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.లాతూర్ నగరంలో ఒక్కరోజే 91 మంది నివాసులకు కరోనా వచ్చింది.లాతూర్ జిల్లాలో కరోనాతో 715 మంది మరణించారు.

Updated Date - 2021-03-12T14:26:45+05:30 IST