మహారాష్ట్ర డ్రగ్స్ కేసులో కొత్త కోణం
ABN , First Publish Date - 2021-10-03T16:30:35+05:30 IST
ముంబై: మహారాష్ట్ర డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
ముంబై: మహారాష్ట్ర డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఎన్సీబీ బృందం దాడి చేసింది. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నం చేసిన డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. ఎఫిడ్రిన్ తయారీ హైదరాబాద్ కేంద్రంగా నడిచినట్లు విచారణలో వెల్లడైంది. ముంబైలోని అంథేరిలో ఐదు కోట్ల విలువైన ఎఫిడ్రిన్ను ఎన్సీబీ బృందం స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల తయారీ హైదరాబాద్లో జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. మాదకద్రవ్యాల ముడి సరుకును హైదరాబాద్కు దిగుమతి చేసుకొని ఎఫిడ్రిన్గా మార్చి అక్రమంగా దందా సాగుతోందని, విదేశాలకూ హైదరాబాద్ నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు ఎన్సీబీ గుర్తించింది. రూ. 50,000 విలువ చేసే ఎఫిడ్రిన్ ఆస్ట్రేలియాలో రూ. 5 లక్షలు పలుకుతున్నట్లు సమాచారం. మొత్తం 10 మందిని ఎన్జీబీ అరెస్ట్ చేసింది. విచారణ కొనసాగుతోంది.