మహారాష్ట్రలో 5 లక్షల మార్క్ ను దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-09T03:02:54+05:30 IST

మహారాష్ట్రలో 5 లక్షల మార్క్ ను దాటిన కరోనా కేసులు

మహారాష్ట్రలో 5 లక్షల మార్క్ ను దాటిన కరోనా కేసులు

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో కొత్తగా 12,822 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,03,084 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా వల్ల ఇవాళ  275 మృతి చెందగా, మొత్తం 17,367 మంది చనిపోయారని వైద్య శాఖ వెల్లడించింది. ఇవాళ కరోనా నుంచి 11,082 మంది డిశ్చార్జ్ అవగా, మొత్తం 3,38,362 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 1,47,048 మందికి కరోనా చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.


Updated Date - 2020-08-09T03:02:54+05:30 IST