మహారాష్ట్రలో ఎంట్రీకి రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి!
ABN , First Publish Date - 2021-08-14T11:38:14+05:30 IST
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో...
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అక్కడి సర్కారు కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికే రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతించాలని నిర్ణయించింది. రాష్ట్రానికి వచ్చేవారు తమతో పాటు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంచుకోవాలని ‘మహా’ సర్కారు తెలిపింది.
వ్యాక్సిన్ వేయించుకోని వారు రాష్ట్రంలోకి రావాలంటే నెగిటివ్ ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ సంబంధిత అధికారులకు చూపించాల్సివుంటుంది. ఈ నియమాలు పాటించని వారిని 14 రోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నారు. మహారాష్ట్రలోకి కరోనా థర్డ్ వేవ్ ప్రవేశించనున్నదనే అనుమానాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలకు ఉపక్రమించింది.