Uddhav కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2022-06-30T00:21:55+05:30 IST
మహారాష్ట్ర క్యాబినెట్ తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ప్రాంతాల పేర్ల మార్పునకు ఆమోదం ..
ముంబై: మహారాష్ట్ర క్యాబినెట్ తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ప్రాంతాల పేర్ల మార్పునకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం క్యాబినెట్ బుధవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైంది. కీలక నిర్ణయాల్లో భాగంగా ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్గా మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఒస్మానాబాద్ పేరును ధారాశివ్గా, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు డీబీ పాటిల్ పేరు పెట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పేర్ల మార్పు డిమాండ్ చిరకాలంగా ఉంది. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన సర్కార్ క్యాబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం, పేర్ల మార్పునకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.