మహాపాదయాత్రకు అపూర్వస్పందన

ABN , First Publish Date - 2021-11-11T02:41:00+05:30 IST

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో జన జాతరలా సాగుతోంది. ఊరూరా ప్రజలు కదలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.

మహాపాదయాత్రకు అపూర్వస్పందన

ఒంగోలు: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో జన జాతరలా సాగుతోంది. ఊరూరా ప్రజలు కదలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. పూలజల్లులు, మేళతాళాలు, కళాప్రదర్శనలతో వేలాది మంది పాదయాత్రకు మద్దతుగా నడుస్తున్నారు. ఈనెల 1న అమరావతిలో జేఏసీ ప్రారంభించిన మహాపాదయాత్ర పదోరోజైన బుధవారం మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 కి.మీ సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలోని టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ స్వామిలతోపాటు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పాదయాత్రలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. గత రాత్రి బస చేసిన పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరులో బుధవారం ఉదయం జేఎసీ నేతలతో కలిసి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు యాత్రను ప్రారంభించారు. ఆ గ్రామంతోపాటు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపి యాత్రలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-11T02:41:00+05:30 IST