మహనీయుడు జయశంకర్ : ఎమ్మెల్యే సైదిరెడ్డి
ABN , First Publish Date - 2021-06-22T06:18:10+05:30 IST
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అహర్నిషలు శ్రమించిన మహనీయుడని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కొనియాడారు.
హుజూర్నగర్/ సూర్యాపేట అర్బన్/తుంగతుర్తి/హుజూర్నగర్/ నేరేడుచర్ల/అర్వపలి/ చిలుకూరు, జూన్ 21: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అహర్నిషలు శ్రమించిన మహనీయుడని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కొనియాడారు. హుజూర్నగర్లో నిర్వహించిన జయశంకర్ వర్థంతిలో ఆయన చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనారవి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రొఫెసర్ జయశంకర్ భావితరాలకు మార్గదర్శకుడని సూ ర్యాపేట మునిసిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్సార్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రా మాంజులరెడ్డి, బాష, తాహేర్పాష, చింతలపాటి భరత్, వెంపటి సురేష్, డీఈ సత్యారావు, శానిటరి ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, శబరి, శంకర్, ఉదయ్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతిని తుంగతుర్తి మండలకేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, రామచంద్రారెడ్డి, తాటికొండ సీతయ్య, గోపగాని రమేష్, ముత్యాల వెంకన్న, వెంకటనారాయణ పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేరేడుచర్లలో జయశంకర్ వర్థంతి నిర్వహి ంచారు. కార్యక్రమంలో నాయకులు ధూళిపాళ ధనుంజయనాయు డు, బొడ్డుపల్లి సుందరయ్య, కొమర్రాజు వెంకట్, రావుల సత్యం, సీతారాములు, వెంకటేశ్వర్లు, శ్రీపాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ పార్టీ ఆధ్వర్యంలో హుజూర్నగర్లో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హుజూర్నగర్ ఇన్చార్జి ఆదెర్ల శ్రీనివాస్రెడ్డి, ఇంజం నర్సిరెడ్డి, పచ్చిపాల వేణు, రవీందర్గౌడ్, అక్తర్, తండు భాస్కర్, సిరాజ్, శం కర్ పాల్గొన్నారు. అర్వపల్లి మండలం కుంచమర్తిలో అర్వపల్లి ఎంపీపీ మన్నె రేణుక జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో సర్పంచ్ ఉగ్గం ఉపేంద్రలింగరాజు, ఉప సర్పంచ్ సయ్యద్, రవీందర్రెడ్డి, మౌనిక, శ్రీను, వీరస్వామి, రాజు పాల్గొన్నారు. జయశంకర్ వర్థంతిని ఎస్టీయూ ఆధ్వర్యంలో చిలుకూరులో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు దొడ్డా నారాయణరావు, గన్నా చంద్రశేఖర్, ఎ ంపీటీసీ కళ్యాణి, కస్తూరి నర్సయ్య, చైర్మన్ అంబాల వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, ఎస్టీయూ నా యకులు కొండా వెంకయ్య, యలగొండ శ్రీను, మంద పుల్లయ్య, గుండు ఆదినారాయణ, ముదిగొండ సురేష్ పాల్గొన్నారు.