మహనీయుల త్యాగం మరువలేనిది

ABN , First Publish Date - 2022-08-18T04:37:16+05:30 IST

బ్రిటీష్‌ పాలన నుంచి దేశ ప్రజల విముక్తి కోసం పోరాడిన మహనీయుల త్యాగం మరువలేనిదని బెల్లంపల్లి ఏసీపీ మహేష్‌ తెలిపారు. బుధవారం మందమర్రి ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశ భక్తిని చాటుదాం జాతీయ జెండాల ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు

మహనీయుల త్యాగం మరువలేనిది
ర్యాలీలో జెండాలు ప్రదర్శిస్తున్న ఏసీపీ మహేష్‌, జర్నలిస్టులు, విద్యార్థులు

- బెల్లంపల్లి ఏసీపీ మహేష్‌ 

మందమర్రి టౌన్‌, ఆగస్టు  17:  బ్రిటీష్‌ పాలన నుంచి దేశ ప్రజల విముక్తి కోసం పోరాడిన మహనీయుల త్యాగం మరువలేనిదని బెల్లంపల్లి ఏసీపీ మహేష్‌ తెలిపారు. బుధవారం మందమర్రి ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశ భక్తిని చాటుదాం జాతీయ జెండాల ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం సింగరేణి పాఠశాల మైదానం నుంచి మార్కెట్‌ పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో  75 మీటర్ల జాతీ య జెండాతో ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో  సీఐ ప్రమోద్‌కు మార్‌,  మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, ఎస్సై చంద్రకుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-18T04:37:16+05:30 IST