మహానాడును విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-24T06:44:03+05:30 IST
ఒంగోలులో ఈనెల27,28 తేదీల్లో జరిగే టీడీపీ మహానాడును విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.
అమలాపురం టౌన్, మే 23: ఒంగోలులో ఈనెల27,28 తేదీల్లో జరిగే టీడీపీ మహానాడును విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి 500మంది నాయకులు, కార్యకర్తలు మహానాడులో పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు కోరారు. సమావేశంలో మండల శాఖల అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబురాజు, మల్లుల పోలయ్య, అరిగెల నానాజీ, తిక్కిరెడ్డి నేతాజీ, కర్రి దత్తుడు, మట్టా మహలక్ష్మిప్రభాకర్, బొర్రా ఈశ్వరరావు, బత్తుల సాయి, కుసుమ సూర్యమోహనరావు తదితరులు పాల్గొన్నారు.