మహానాడులో ఉప్పొంగుతున్న ఉత్సాహం
ABN , First Publish Date - 2022-05-27T15:48:03+05:30 IST
మహానాడులో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ప్రతినిధుల పేర్ల నమోదు ప్రక్రియకు అశేష స్పందన లభిస్తోంది.
అమరావతి : మహానాడులో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ప్రతినిధుల పేర్ల నమోదు ప్రక్రియకు అశేష స్పందన లభిస్తోంది. నమోదు ప్రక్రియ ప్రారంభించిన గంటలోపే సుమారు 10 వేల మంది ఆహ్వానితులు వచ్చారు. ఆహ్వానితులే కాకుండా సామాన్యులు సైతం తమ పేరు నమోదు చేసుకొని మహానాడుకు మద్దతు తెలుపుతున్నారు. ఈ ఒక్క రోజే 50 వేల మందికి పైగా తమ పేరును నమోదు చేసే అవకాశం ఉందని కమిటీ సభ్యులు చెబుతున్నారు.