మట్టపల్లి క్షేత్రంలో మహాలక్ష్మీ యాగం
ABN , First Publish Date - 2022-05-18T07:05:45+05:30 IST
బ్రహ్మోత్సవాల సందర్భంగా మట్టపల్లి నృసింహుని క్షేత్రంలో మంగళవారం శ్రీసూక్తసహిత మహాలక్ష్మీయాగాన్ని వేదపండితులు శాస్రోక్తంగా నిర్వహించారు.
మఠంపల్లి,మే 17: బ్రహ్మోత్సవాల సందర్భంగా మట్టపల్లి నృసింహుని క్షేత్రంలో మంగళవారం శ్రీసూక్తసహిత మహాలక్ష్మీయాగాన్ని వేదపండితులు శాస్రోక్తంగా నిర్వహించారు.వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో సరికొండ నవీన్, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామ శాస్త్రి, శేషగిరిరావు, గోవిందరెడ్డి, శ్రీనివాసరావు, సీత, రాజేష్ పాల్గొన్నారు.