అమ్మవారికి విశేష పూజలు

ABN , First Publish Date - 2020-10-24T11:04:45+05:30 IST

పట్టణంలోని అమ్మవారిశాలలో శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనం ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘం తాత్కాలిక అధ్యక్షుడు ..

అమ్మవారికి విశేష పూజలు

డోన్‌, అక్టోబరు 23: పట్టణంలోని అమ్మవారిశాలలో శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనం ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘం తాత్కాలిక అధ్యక్షుడు కోట్రికే ఫణిరాజ్‌,  ప్రధాన కార్యదర్శి సీ.ఎం.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. 


ఆదోని: ఆదోని మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆల యంలో శుక్రవారం లక్ష్మమ్మవ్వ తమలపాకు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. 


బేతంచెర్ల: పట్టణంలోని అమ్మవారిశాలలో కన్యకా పరమేశ్వరీదేవి శుక్రవారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు పవన్‌కుమార్‌ శర్మ అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు.  


గూడూరు: మండలంలోని కె.నాగులాపురం సుంకులమ్మ ఆలయంలో అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. 


మద్దికెర: మద్దికెర గ్రామంలోని నగరేశ్వరస్వామి ఆలయంలో  శుక్రవారం వాసవీమాత భాగ్యలక్ష్మిదేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు.  ఆర్యవైశ్య సంఘం నాయకులు రవీంద్రనాథ్‌శెట్టి, రాజశేఖర్‌శెట్టి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T11:04:45+05:30 IST