ఉపాధ్యాయ బదిలీలు.. పదోన్నతులపై నేడు మహాధర్నా
ABN , First Publish Date - 2022-07-07T09:50:39+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు.
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయాలని చాలా కాలం నుంచి ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే జివో 317 కారణంగా నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని, పాఠశాలల్లో విద్యా వలంటీర్లను, పారిశుధ్య నిర్వహణ కార్మికులను నియమించాలని, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను వెంటనే సరఫరా చేయాలని పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నది.