మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-02-20T06:27:16+05:30 IST

జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఈనెల 20న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు డీఈవో గోవిందరాజులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

నాగర్‌కర్నూల్‌ అర్బన్‌, ఫిబ్రవరి 19 : జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఈనెల 20న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు డీఈవో గోవిందరాజులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాతృభాష వ్యాప్తిని ప్రోత్సహించడానికి ప్రపంచ వ్యాప్తంగా భాషా సాంస్కృతిక, సాంప్రదాయాలపై అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. పాఠశాలలకు ఈనెల 21న శివరాత్రి సందర్భంగా సెలవు కాబట్టి ఒక రోజు ముందుగానే ఈనెల 20నే అంతర్జాతీయ భాషా దినోత్సవం మాతృభాషలో రాజ్యాంగం ముందు మాట కథనం, రాజ్యాంగంలోని ఉపోద్ఘాతం పఠనం, బృంద, జానపద పాటలు, వ్యాసరచన  పోటీలు, చర్చలు, బోర్డులు, పోస్టర్ల ద్వారా దేశ భాషలను ప్రదర్శించడంతోపాటు భారతీయ భాషా వారసత్వంపై జీకే పోటీలు నిర్వహించాలన్నారు. వీటితోపాటు మాతృభాషను ప్రోత్సహించేలా ఇతర కార్యక్రమాలు నిర్వహించి, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను డీఈవో కార్యాలయానికి అందజేయాలన్నారు.

Updated Date - 2020-02-20T06:27:16+05:30 IST