Mahabubabad: ప్రిన్సిపల్ నిర్లక్ష్యం... క్షీణించిన విద్యార్థిని ఆరోగ్యం
ABN , First Publish Date - 2021-12-08T17:23:13+05:30 IST
ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థిని ఆరోగ్యం క్షీణించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్: ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థిని ఆరోగ్యం క్షీణించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఓ బాలిక జ్వరంతో బాధపడుతూ తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వమని ప్రిన్సిపాల్ను ప్రాధేయపడింది. అయితే ప్రిన్సిపాల్ కనికరించలేదు. దీంతో సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో విద్యార్థిని ఆరోగ్యం క్షీణించింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.