ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వేధింపులు...ఉద్యోగి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-03-12T13:58:58+05:30 IST
జిల్లాలోని కేసముద్రం మండలం ధన్నసరి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వేధింపులు తాళలేక ఉద్యోగి పాక రామచంద్రయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.
మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం మండలం ధన్నసరి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వేధింపులు తాళలేక ఉద్యోగి పాక రామచంద్రయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకుకు సంబంధించిన డబ్బులు వాడుకున్నాడని చైర్మన్ మర్రి రంగారావు వేధింపులకు గురిచేశాడు. రంగారావు వేధింపులు తాళలేక రామచంద్రయ్య పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.