Telangana: పెట్రోల్ బంక్లో మోసం...బాధితుడి ఆందోళన
ABN , First Publish Date - 2021-11-18T14:25:21+05:30 IST
జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులో నిర్వాహకులు మోసానికి పాల్పడ్డారు.
మహబూబాబాద్: జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులో నిర్వాహకులు మోసానికి పాల్పడ్డారు. లీటర్ పెట్రోల్ కొడితే సగం కూడా రాకపోవడంతో ఓ బాధితుడు ఆందోళనకు దిగారు. అదే పెట్రోల్ ఒంటిపై పోసుకున్న బాధితుడు... ఎందుకు తక్కువగా కొట్టారో చెప్పాలని నిలదీశాడు. అసలే పెట్రోల్ ధరలు అకాశాన్నంటడంతో బంకుల్లో మోసాలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.