Mahabubabd: పల్లెప్రగతిలో అపశృతి
ABN , First Publish Date - 2022-06-03T16:34:49+05:30 IST
జిల్లాలోని గూడూరు మండలం సీతానగరం పల్లెప్రగతిలో అపశృతి చోటు చేసుకుంది.
మహబూబాబాద్: జిల్లాలోని గూడూరు మండలం సీతానగరం పల్లెప్రగతిలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి జీపీ వర్కర్ సాంబయ్య మృతి చెందాడు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపతిపేట నుంచి తిరిగి సీతానగరం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.