మహబూబాబాద్లో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2022-04-30T17:32:22+05:30 IST
జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర బాజార్లో శనివారంఅగ్ని ప్రమాదం సంభవించింది.
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర బాజార్లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. తాళం వేసి ఉన్న పెంకు ఇంటిలో విద్యుత్ షాక్తో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు బకెట్లతో నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. అగ్ని ప్రమాద సమయంలో యజమాని ఆనంద్, కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.