మహబూబాబాద్ కలెక్టరేట్ ముట్టడి
ABN , First Publish Date - 2021-11-08T21:09:25+05:30 IST
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ను కొత్తగూడ మండల
మహబూబాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ను కొత్తగూడ మండల గిరిజనేతరులు ముట్టడించారు. ఈ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. ఎఫ్ఆర్సీ కమిటీలో 1/3 ప్రాధాన్యత కల్పించాలన్నారు. 1/70చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలలో 1970 కంటేముందు నివసించే రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని గిరిజనేతరులు డిమాండ్ చేసారు.
అటవీ ప్రాంతాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూ పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాలలో ఉంటున్న తమకు కూడా పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గిరిజనేతరులు డిమాండ్ చేస్తున్నారు.