విలేఖరి కుమారుడు కిడ్నాప్.. భారీగా డబ్బు డిమాండ్
ABN , First Publish Date - 2020-10-19T13:52:08+05:30 IST
జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఓ విలేఖరి కొడుకు కిడ్నాప్ చేసిన దుండగులు భారీగా డబ్బును డిమాండ్ చేశారు.
మహబూబాబాద్: జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఓ విలేఖరి కొడుకు కిడ్నాప్ చేసిన దుండగులు భారీగా డబ్బును డిమాండ్ చేశారు. రూ.40 లక్షలు ఇస్తేనే వదులుతామంటూ ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.