మహబూబాబాద్లో రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి
ABN , First Publish Date - 2020-07-16T13:06:51+05:30 IST
మహబూబాబాద్లో రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి
మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలం చీటాయపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతు తండా వాసులుగా గుర్తించారు.