వలలో చిక్కుకున్న కోతి...ప్రాణదానం చేసిన యువతి
ABN , First Publish Date - 2021-06-23T19:49:24+05:30 IST
వలలో చిక్కి రక్తసిక్తమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోతిపిల్లలను ఓ యువతి ..
మహబూబాబాద్: వలలో చిక్కి రక్తసిక్తమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోతిపిల్లను ఓ యువతి చాకచక్యంగా కాపాడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఇంటికి రక్షణగా యజమాని ఏర్పాటు చేసుకున్న వలలో ఓ కోతి పిల్ల చిక్కుకుంది. ఊపిరాడక చావు బతుకుతో కొట్టిమిట్టాడింది. దానిని కాపాడుకునేందుకు కోతుల గుంపు అక్కడే సంచరిస్తూ తిరిగాయి. కోతి పిల్లలను కాపాడే ప్రయత్నం చేసిన వారిపై పడుతూ హల్ చల్ చేశాయి.
వలకు చిక్కి రక్తసిక్తమైన కోతిపిల్లను, అక్కడి పరిస్థితిని అటుగా వెళుతున్న మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి గమనించారు. ఆయన వెంటనే నేను సయితం స్వచ్చంధసేవా సభ్యురాలు సుమకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆమె వలలో చిక్కుకున్న కోతి పిల్లను కాపాడారు. దాని ముఖానికి ఉన్న రక్తాన్ని శుభ్రం చేసి, పాలు తాగించి తేరుకున్న తర్వాత దాని తల్లి వద్దకు చేర్చారు.