ప్రజా సంక్షేమం కోసమే మహా యజ్ఞం

ABN , First Publish Date - 2021-01-25T06:25:25+05:30 IST

ప్రజల సంక్షేమం కోసం మహా యజ్ఞం నిర్వహి స్తున్నట్లు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు. గత వారం రోజుల నుంచి మండలంలోని రచ్చకోట గ్రామంలో ఆదివాసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా యజ్ఞంలో భాగంగా ఆదివారం ఆయన సతీసమేతంగా పాల్గొని యజ్ఞం నిర్వహించారు.

ప్రజా సంక్షేమం కోసమే మహా యజ్ఞం
యజ్ఞంలో పాల్గొన్న ఎంపీ సోయం బాపురావు దంపతులు

రచ్చకోట మహా యజ్ఞంలో ఎంపీ సోయం

మామడ, జనవరి 24: ప్రజల సంక్షేమం కోసం మహా యజ్ఞం నిర్వహి స్తున్నట్లు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు. గత వారం రోజుల నుంచి మండలంలోని రచ్చకోట గ్రామంలో ఆదివాసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా యజ్ఞంలో భాగంగా ఆదివారం ఆయన సతీసమేతంగా పాల్గొని యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావ్‌ మాట్లాడుతూ ప్రజలు చెడు వ్యసనాల వైపు పోకుండా మంచి మార్గంలో నడవాలని తెలిపారు. ఏడు రోజుల నుంచి ఈ యజ్ఞంలో పాల్గొన్న ఆదివాసీలకు మంచి జరగాలని కోరుతున్నాను అన్నారు. గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతా నని తెలిపారు. అప్పట్లో రాముడు గిరిజనుల అభ్యన్నతి కోసం ధర్మ జాగృ తి యజ్ఞం చేపట్టాడని, ఇప్పుడు మేము నిర్వహించడం చాలా అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తన శుద్ధి కన్వీనర్‌ అయ్యన్నగారి భూమయ్య, ఆదివాసీ నాయకుడు ఆనంద్‌, సర్పంచ్‌ లక్కుబాయి, జిల్లా ఆదివాసీ ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌, వివిధ గ్రామాల ఆదివాసీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T06:25:25+05:30 IST