ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
ABN , First Publish Date - 2020-02-22T08:44:50+05:30 IST
మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పూజలు చేశారు.
మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పూజలు చేశారు. అమృత్ సర్ లో శివలింగానికి పాలాభిషేకం చేశారు. లఖ్నవూలో ‘శివ బరాత్’ తీశారు. థానేలోని కోపినేశ్వర్ దేవాలయంలో శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ప్రయాగ్రాజ్లో ఓ మహిళ నాలికపై మండుతున్న కర్పూరం పెట్టుకొని భక్తిని చాటుకుంది. శ్రీనగర్లోని శంకరాచార్య దేవాలయంలో భక్తులకు భారీ భద్రత కల్పించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్నాథ్ మఠంలో అభిషేకం నిర్వహించారు. జమ్మూలో భక్తులు శివుడి ప్రసాదంగా ‘భంగ్ ఘోటా’ స్వీకరించారు. వారాణసీలో శివుడి దర్శనానికి భక్తులు భారీ క్యూ కట్టారు. దుబాయిలోని హవేలీ ప్రాంగణం జనసంద్రమైంది. దుబాయిలోని ఏకైక హిందూ ఆలయం శివమందిర్ భక్తులతో కిక్కిరిసింది. పెద్ద సంఖ్యలో వచ్చిన తెలుగువారు పూజల కంటె సెల్ఫీల్లోనే ఎక్కువగా గడిపారు.