మహాశివరాత్రికి 200 ప్రత్యేక సర్వీసులు
ABN , First Publish Date - 2020-02-20T08:34:16+05:30 IST
మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం వివిధ ఆధ్యాత్మిక ప్రాంతాలకు 200 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు పౌర రవాణా శాఖ విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది. వివిధ ఆలయాలకు
ద్వారకాబ్సస్టేషన్, ఫిబ్రవరి 19 : మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం వివిధ ఆధ్యాత్మిక ప్రాంతాలకు 200 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు పౌర రవాణా శాఖ విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది. వివిధ ఆలయాలకు, దర్శనీయ స్థలాలకు రాకపోకలు సాగించే భక్తులకు రవాణా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలుగకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేస్తున్నట్టు రీజనల్ మేనేజర్ ఎంవై దానం తెలిపారు. రామకృష్ణా బీచ్లో టీఎస్సార్ కళా పీఠం నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు గాజువాక నుంచి 25, సింహాచలం నుంచి 25 ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేయనుంది. ఈ ప్రత్యేక సర్వీసులు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నిర్విరామంగా రవాణా సేవలందిస్తాయని అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ సర్వీసులకు అదనంగా వీటిని నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. కల్యాణపులోవ తీర్థానికి చోడవరం నుంచి 15, రావికమతం నుంచి 15, కొత్తకోట నుంచి 10, నర్సీపట్నం నుంచి 15 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పికొండ సోమేశ్వరాలయానికి పాత గాజువాక నుంచి 35, అగనంపూడి నుంచి 15 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. పుణ్యగిరి తీర్థానికి అనకాపల్లి నుంచి 10 బస్సులు, దారమఠం తీర్థానికి నర్సీపట్నం నుంచి 20 ప్రత్యేక సర్వీసులు, మత్స్యగుండం తీర్థానికి పాడేరు నుంచి 15 ప్రత్యేక బస్సులు నడిపేందుకు విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ రవాణా సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆర్ఎం కోరారు.