మహానాడుకు భారీగా తరలిరండి
ABN , First Publish Date - 2022-05-25T03:03:35+05:30 IST
ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరగనున్న మహానాడుకు మండలం నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో
లింగసముద్రం, మే 24 : ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరగనున్న మహానాడుకు మండలం నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలిరావాలని కందుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. లింగసముద్రంలో మండల టీడీపీ అధ్యక్షుడు వేముల గోపాలరావు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇంటూరి మాట్లాడుతూ మండలంలోని 16 పంచాయతీల నుంచి కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత మహానాడుకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహానాడును విజయవంతం చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దెల రామారావు, పూరిమిట్ల మాల్యాద్రి, అడపా రంగయ్య, గాలంకి ప్రసాదు, సయ్యద్ నాయబ్రసూల్, బొల్లినేని నాగేశ్వరరావు తదితరు పాల్గొన్నారు.
మహానాడు విజయవంతానికి చొరవ చూపాలి
కందుకూరు, మే 24: ఒంగోలులో ఈనెల 27,28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కోరారు. కందుకూరు పట్టణ స్థాయి సన్నాహక సమావేశం మంగళవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. శివరాం మాట్లాడుతూ పట్టణంలోని 32 వార్డుల నుంచి అధికసంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, మహిళలు తరలివచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, రానున్న ఎన్నికలలో టీడీపీకి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు బెజవాడ ప్రసాదు, గోచిపాతల మోషే, చిలకపాటి మధు, రాయపాటి శ్రీనివాసరావు, మోదడుగు వెంకటేశ్వర్లు, వడ్డెళ్ల రవిచంద్ర, ముచ్చు శ్రీను తదితరులు పాల్గొన్నారు.