వైభవంగా ముగిసిన మహా మృత్యుంజయ హోమం

ABN , First Publish Date - 2021-06-20T05:39:49+05:30 IST

మండలంలోని బర్దీపూర్‌ దత్తగిరి ఆశ్రమంలో 41 రోజుల నుంచి కొనసాగుతున్న మహా మృత్యుంజయ హోమం శనివారంతో వైభవంగా ముగిసింది.

వైభవంగా ముగిసిన మహా మృత్యుంజయ హోమం

పాల్గొన్న దుబ్బాక, శ్రీశైలం ఎమ్మెల్యేలు రఘనందన్‌రావు,  శిల్పా చక్రపాణి రెడ్డి

ఝరాసంగం, జూన్‌ 19: మండలంలోని బర్దీపూర్‌ దత్తగిరి ఆశ్రమంలో 41 రోజుల నుంచి కొనసాగుతున్న మహా మృత్యుంజయ హోమం శనివారంతో వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్‌ రావు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దేవేందర్‌ రెడ్డి పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ ఆర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమంలోని నవగ్రహాలకు, పంచవృక్షాలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్‌ను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ భావి పీఠాధిపతి డాక్టర్‌ సిద్ధయ్య స్వామి, ఆయా ఆశ్రమాల పీఠాధిపతులు, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:39:49+05:30 IST