శరద్ పవార్పై మహా కాంగ్రెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-07-15T23:33:29+05:30 IST
శరద్ పవార్పై మహా కాంగ్రెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవారేనని, ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ ఆయన దగ్గరే ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధినేత నానా పటోలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు కలిసి మహా వికాస్ అగాడీ అనే పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతే కాకుండా ఎన్సీపీకి కాంగ్రెస్ ఎప్పటి నుంచో మిత్రపక్షం ఈ నేపథ్యంలో నానా పటోలే పవార్ను రిమోట్ కంట్రోల్ అంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతకరించుకుంది.
‘‘ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేది శరద్ పవారే. ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ ఆయన వద్దే ఉంది. మేము ఏ పెద్ద నేతపై ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వబోం. కానీ బయటి వ్యక్తులు ఎవరైనా మాపై వ్యాఖ్యానించదల్చుకుంటే ముందు తమవైపు ఓసారి చూసుకోవాలి’’ అని పటోలే అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలో శరద్ పవార్ తాజాగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించే నానా పటోలే ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.