Uddhav ఇంటివద్ద గుండెపోటుతో మరణించిన Shiv Sainik కు పరిహారం

ABN , First Publish Date - 2022-07-14T01:27:00+05:30 IST

గుండెపోటుతో మరణించిన ఒక శివసైనికుడి కుటుంబానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే..

Uddhav ఇంటివద్ద గుండెపోటుతో మరణించిన Shiv Sainik కు పరిహారం

ముంబై: గుండెపోటుతో మరణించిన ఒక శివసైనికుడి (Shiv Sainik) కుటుంబానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath shinde) బుధవారంనాడు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) నివాసం వద్ద భగవాన్ కలే (55) అనే శివసైనికుడు  ఈనెల 6వ తేదీన గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా అతను మరణించాడు. కలే కొందరు పార్టీ కార్యకర్తలతో కలసి తమ మద్దతు తెలిపేందుకు బాంద్రా ఏరియాలోని ఉద్ధవ్ థాకరే నివాసమైన 'మాతోశ్రీ'కి వెళ్లినప్పుడు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.


కాగా, పార్టీ కార్యకర్త హఠాన్మరణ సమాచారం తెలిసిన వెంటనే అతని కుటుంబానికి రూ.3 లక్షల పరిహారాన్ని షిండే ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే పాండురంగ బరోరా, సేన థానే రూరల్ కార్యదర్శి సాయినాథ్ తారేలు కలే ఇంటికి వెళ్లి, ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.3 లక్షలలో లక్ష రూపాయలు తక్షణ సాయంగా అందజేశారు.

Updated Date - 2022-07-14T01:27:00+05:30 IST