తెలంగాణ మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-05-17T06:05:18+05:30 IST
తెలంగాణ నుంచి అక్ర మంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇరువురిని అదుపులోకి తీసుకొని బైక్లు సీజ్చేసిన సంఘటన మండలంలోని మన్నెసుల్తానపాలెంలో ఆది వారం జరిగింది.
ఇద్దరు అరెస్టు
బెల్లంకొండ, మే 16: తెలంగాణ నుంచి అక్ర మంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇరువురిని అదుపులోకి తీసుకొని బైక్లు సీజ్చేసిన సంఘటన మండలంలోని మన్నెసుల్తానపాలెంలో ఆది వారం జరిగింది. బెల్లంకొండ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణా నుంచి మద్యాన్ని తరలిస్తు న్నట్లు సమాచారం రావటంతో కందిపాడు, మన్నెసుల్తానపాలెం గ్రామాల మధ్య అటవీప్రాంతంలో తనిఖీలు చేపట్టగా ఇరువురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై 341 తెలంగాణా మద్యాన్ని తీసుకొస్తున్నారు. అది గమనించిన సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని విచారించగా క్రోసూరు మండలం 88 తాళ్లూరుకు చెందిన కె.సాంబశివరావు, కె.ఏడుకొండలు అనే ఇరువురు వ్యక్తులు మద్యాన్ని తరలిస్తున్నారని, వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న మద్యం సీసాలను స్వాధీనంచేసుకొని ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. ఈ దాడుల్లో ట్రైనింగ్ ఎస్సై సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.