మదినిండా.. జాతీయ జెండా
ABN , First Publish Date - 2022-08-13T05:57:42+05:30 IST
జూపూడిలో శుక్రవారం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ర్యాలీలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరారవు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 12: జూపూడిలో శుక్రవారం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ర్యాలీలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరారవు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 వరకు వేడుకల్లో పాల్గొన్నాలన్నారు. 15న గుంటూరులో చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో రామినేని రాజశేఖర్, గొరిజాల సాంబశివరావు, సైకం సాంబశివరావు, కాకి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట: ప్రముఖ వ్యాపారవేత్త పేరూరి నరసింహారావు వితరణతో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జాతీయ జెండాను మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పంపిణీ చేశారు. గెల్లా వైకుంఠరావు, సోమేశ్వరరావు, కర్లపాటి కొండా, కొప్పు సత్యనారాయణ, సుధాకర్ పాల్గొన్నారు.
జగ్గయ్యపేట రూరల్ : ప్రభుత్వం కోటి త్రివర్ణ పతాకాలను గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ అందించేందుకు కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. ముక్త్యాలలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. అనంతరం మండల, జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీలో పాల్గొన్నారు.
నందిగామ రూరల్ : పట్ణణంలో లౌకిక రాజ్య పరిరక్షణ వేదిక, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. సోమేశ్వరరావు, గోపాల్, చనుమోలు సైదులు, సయ్యద్ ఖాశీం, వెంకటేశ్వరరావు, రవి, హుసేన్, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. మిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస రావు, వంశీ కిరణ్, రాజేష్ ర్యాలీ నిర్వహించారు.