ఎస్సీ వర్గీకరణ సాధనే ధ్యేయంగా మాదిగ సంగ్రామ యాత్ర
ABN , First Publish Date - 2022-06-27T04:04:24+05:30 IST
ఎస్సీ వర్గీకరణ సాధన ధ్యేయంగా మాదిగ సంగ్రామ యాత్ర చేపట్టినట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ చెన్నూరి సమ్మయ్య మాదిగ అన్నారు. సంగ్రామ యాత్ర ఆదివారం దండేపల్లికి చేరగా మండల నాయకులు స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సమ్మ య్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి మోసం చేశాయన్నారు.
దండేపల్లి, జూన్ 26: ఎస్సీ వర్గీకరణ సాధన ధ్యేయంగా మాదిగ సంగ్రామ యాత్ర చేపట్టినట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ చెన్నూరి సమ్మయ్య మాదిగ అన్నారు. సంగ్రామ యాత్ర ఆదివారం దండేపల్లికి చేరగా మండల నాయకులు స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సమ్మ య్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి మోసం చేశాయన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు జూలై 2న సడక్ బంద్, 3న హైదరాబాద్ దిగ్బంధం చేయాలని సంగ్రామ యాత్ర చేపట్టామన్నారు. 3న చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. నాయకులు సత్తయ్య, రవికూమర్, గంగాధర్, శనిగారపు శ్రీకాంత్, నాతరి సాయికిరణ్, సంగ్రామ యాత్రలో ఉదయ్, ప్రకాష్, సుగుణాకర్ పాల్గొన్నారు.