మాదిగ సంగ్రామ పాదయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2022-06-24T03:56:24+05:30 IST
మండలంలో పెయ్యలపాలెం నుంచి గురువారం మాదిగ విద్యార్థి ఫెడరేషన్(ఎంఎస్ఎఫ్) జిల్లా నాయకుడు కోలగట్ల రమేష్ ఆధ్వర్యం
కొడవలూరు జూన్ 23 : మండలంలో పెయ్యలపాలెం నుంచి గురువారం మాదిగ విద్యార్థి ఫెడరేషన్(ఎంఎస్ఎఫ్) జిల్లా నాయకుడు కోలగట్ల రమేష్ ఆధ్వర్యంలో మాదిగ సంగ్రామ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా నార్తురాజుపాలెం ప్రధాన కూడలిలో అంబేడ్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు మండలంలో పెయ్యలపాలెం నుంచి కోవూరు, బుచ్చి, సంగం మీదుగా ఆత్మకూరు వరకు యాత్ర చేపట్టామని తెలిపారు. ఈనెలాఖరుకు ఆత్మకూరుకు పాదయాత్ర చేరుతుందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ యాత్ర చేపట్టామ న్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దీపోగు మస్తానయ్య, బద్దిపూడి వివేక్ తదితరులు పాల్గొన్నారు.