మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి సారంగ్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-08-10T11:23:26+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారంగ్ కు కరోనా వైరస్ సోకింది.

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి సారంగ్‌కు కరోనా

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారంగ్ కు కరోనా వైరస్ సోకింది. ‘‘నేను రెండోసారి చేయించుకున్న కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది. మొదటి కరోనా పరీక్షలో కరోనా నెగిటివ్ అని రావడంతో నేను హోం ఐసోలేషన్ లో ఉన్నాను. నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని మంత్రి విశ్వాస్ సారంగ్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా సోకి ఆసుపత్రిలో చేరడంతో సీఎం త్వరగా కోలుకోవాలని మంత్రి సారంగ్ కోరారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 38,157 కు పెరిగింది.  కేంద్రమంత్రి అమిత్ షాతోపాటు కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప, మంత్రి బి శ్రీరాములుకు కరోనా సోకింది. 

Updated Date - 2020-08-10T11:23:26+05:30 IST