‘‘అమ్మా! ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావ్’’.. అంటూ ప్రశ్నించిన కొడుకు.. ఓ రోజు అసలు నిజం తెలియడంతో..

ABN , First Publish Date - 2022-03-18T00:29:22+05:30 IST

తప్పు దారిలో వెళ్లే కొడుకును సరైన మార్గంలో నడిపించేందుకు తల్లి ఎంత తపన పడుతుందో అందరికీ తెలుసు. అలాంటిది తల్లే తప్పు చేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించరు. కానీ..

‘‘అమ్మా! ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావ్’’.. అంటూ ప్రశ్నించిన కొడుకు.. ఓ రోజు అసలు నిజం తెలియడంతో..

తల్లీకొడుకుల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తప్పు దారిలో వెళ్లే కొడుకును సరైన మార్గంలో నడిపించేందుకు తల్లి ఎంత తపన పడుతుందో అందరికీ తెలుసు. అలాంటిది తల్లే తప్పు చేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించరు. కానీ కొందరు తల్లులు మాత్రం.. సాటి మహిళలు తల దించుకునే పని చేస్తూ, అందరితో ఛీకొట్టించుకుంటూ ఉంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. తల్లి ప్రవర్తనపై అనుమానం రావడంతో..‘‘అమ్మా! ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావ్’’.. అంటూ ప్రశ్నించాడు. చివరికి అసలు నిజం బయటపడడంతో కొడుకుతో పాటూ అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌ పరిధి షబ్రీనగర్‌లో ఓ మహిళ తన కొడుకుతో కలిసి నివాసం ఉంటోంది. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న గోపాల్ అనే వ్యక్తి.. ఆటో నడుపుకొంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గోపాల్‌కు, మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరచూ మహిళ ఇంటికి వెళ్తూ మాట్లాడుతుండేవాడు. మహిళ తన కొడుక్కు తెలీకుండా గోపాల్‌ను కలుస్తూ ఉండడంతో పాటూ రోజూ ఫోన్లలో కూడా మాట్లాడుతూ ఉండేది. గత మంగళవారం కూడా మహిళ తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా.. హఠాత్తుగా కొడుకు వచ్చాడు. తల్లిపై అనుమానం రావడంతో ‘‘‘అమ్మా! ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావ్’’.. అంటూ ప్రశ్నించాడు. కొడుక్కి అనుమానం రాకుండా బంధువులని చెప్పి నమ్మించింది. అయితే రోజూ ఇలా ఫోన్‌లో మాట్లాడుతుండడంతో కొడుక్కి అసలు విషయం తెలిసింది. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా తల్లి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గోపాల్‌ను అంతమొందించాలని.. మహిళ కొడుకు నిర్ణయించుకున్నాడు.

బాలికలను టార్గెట్ చేసిన స్కూల్‌ యజమాని.. పదో తరగతి బాలికే లక్ష్యంగా కుట్ర.. చివరకు ఓ రోజు..


తన అత్త కొడుకును కలిసి విషయం చెప్పి, ఇద్దరూ కలిసి గోపాల్‌ హత్యకు ప్లాన్ వేశారు. ఓ రోజు మందు తాగుదామంటూ గోపాల్‌ను గ్రామ పరిసరాలకు పిలిపించారు. మద్యం సేవించే క్రమంలో గోపాల్‌పై ఇద్దరూ ఒక్కసారిగా దాడి చేసి, కత్తితో గొంతు కోశారు. దీంతో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

అమ్మా! త్వరగా తలుపు తీయి.. అంటూ డోర్ కొట్టిన కూతురు.. ఎంతకీ తీయకపోవడంతో వెనుక డోర్ నుంచి వెళ్లగా..

Updated Date - 2022-03-18T00:29:22+05:30 IST