13ఏళ్ల కూతురు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి చేసిన పనికి.. తండ్రికి తగిలిన కోలుకోలేని దెబ్బ.. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2021-10-27T17:12:19+05:30 IST

ఓ అమ్మాయి స్నేహితుడితో కలిసి..

13ఏళ్ల కూతురు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి చేసిన పనికి.. తండ్రికి తగిలిన కోలుకోలేని దెబ్బ.. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే..!

ఇంటర్‌నెట్‌డెస్క్: ఓ అమ్మాయి స్నేహితుడితో కలిసి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె చేసిన పనికి తండ్రికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..


జిల్లాలోని సింగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘట్ పిపారియా అనే గ్రామంలో కన్హయ్య బార్సియా అనే 36ఏళ్ల వ్యక్తి తన కూతురితో కలిసి నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్ల క్రితం అతని భార్య చనిపోవడంతో.. ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. అయితే మంగళవారం ఉదయం కన్హయ్య కూతురు తన స్నేహితుడితోపాటు సింగోడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. కాసేపటికి కొంతమంది పోలీసులు ఆమెను తీసుకుని వారి గ్రామానికి వచ్చారు. పోలీసులతో పాటు కూతురు ఉండడం గమనించి కన్హయ్య బిత్తరపోయాడు. అసలు విషయం ఎక్కడా భయపడుతుందేమోనని కంగారుపడ్డాడు. చివరికి అతడి అనుమానమే నిజమైంది. పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



సంగోడి పోలీస్‌స్టేషన్ అధికారి సంతోష్ దెహ్రియా మాట్లాడుతూ సోమవారం సాయంత్రం కన్హయ్య అతని మిత్రుడు అజేష్ వర్మ(28) మద్యం సేవించడానికని గ్రామం పక్కన ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లారని, మద్యం సేవించే సమయంలో వారిద్దరి మధ్య ఏదో గొడవ జరగడంతో కన్హయ్య అతడి స్నేహితుడిని చంపేశాడన్నారు. అజేష్‌ను చంపడం కన్హయ్య కూతురు చూసిందని, దీంతో ఆమెను కూడా ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని అతడు బెదిరించాడన్నారు. కానీ ఆ అమ్మాయి తండ్రి చేసిన నేరాన్ని మంగళవారం ఉదయం తమ ముందుకు వచ్చి చెప్పడంతో సంఘటనా స్థలానికి వెళ్లామని, కన్హయ్య తమను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడన్నారు. ఆ యువతి.. అజేష్ శవాన్ని కన్హయ్య ఎక్కడ పాతిపెట్టాడో చెప్పడంతో అక్కడికి వెళ్లామన్నారు. చివరికి కన్హయ్య తన తప్పును అంగీకరించాడన్నారు. అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామన్నారు.


మద్యంపానం అలవాటు ఉన్న కన్హయ్య.. అతని భార్య చనిపోయనప్పటినుంచి కూతురిని కొట్టేవాడని తెలిసింది. సోమవారం సాయంత్రం తండ్రి చేసిన నేరాన్ని చూసి ఆ అమ్మాయి షాక్‌కు గురైంది. అజేష్‌ను చంపి అడవిలో పాతిపెట్టడం చూసిన కూతురిని కన్హయ్య బెదిరించాడు. ‘ఎవరికైనా చెబితే నిన్ను కూడా చంపేస్తా..’అని తండ్రి బెదిరించడంతో ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోయింది. కానీ ధైర్యం చేసి.. తండ్రి చేసిన దారుణాన్ని తన స్నేహితుడికి చెప్పింది. అతడి సహాయంతో మంగళవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అసలు విషయం చెప్పేసింది.



Updated Date - 2021-10-27T17:12:19+05:30 IST