మదురై-తిరుపతి విమానసేవలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-21T15:18:46+05:30 IST

మదురై-తిరుపతి విమాన సేవలు ప్రారంభమైన మొదటి రోజునే 53 మంది ప్రయాణించారు. మదురై నుంచి తిరుపతికి విమానాలు నడపాలని దక్షిణ జిల్లాల ప్రజలు కోరుతు న్నారు. వారి విజ్ఞప్తి మేరకు ప్రైవేటు వి

మదురై-తిరుపతి విమానసేవలు ప్రారంభం

ఐసిఎఫ్‌(చెన్నై): మదురై-తిరుపతి విమాన సేవలు ప్రారంభమైన మొదటి రోజునే 53 మంది ప్రయాణించారు. మదురై నుంచి తిరుపతికి విమానాలు నడపాలని దక్షిణ జిల్లాల ప్రజలు కోరుతు న్నారు. వారి విజ్ఞప్తి మేరకు ప్రైవేటు విమాన సంస్థ ఈనెల 19వ తేదీ నుంచి ప్రతిరోజూ విమానసేవలు నడుపనున్నట్లు ప్రకటించింది. మదురై నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మళ్లీ అదే విమానం సాయంత్రం 4.45 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి 6.05 గంటలకు మదురై చేరుకుంటుంది. మొదటి రోజైన శుక్రవారం మదురై నుంచి తిరుపతికి 53 మంది, తిరుపతి నుంచి మదురైకు 11 మంది ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-11-21T15:18:46+05:30 IST