మాధవరంలో రోడ్డు ప్రమాదం: యువతి మృతి
ABN , First Publish Date - 2022-07-28T16:21:37+05:30 IST
స్థానిక మాధవరం పాల డిపో సమీపం బ్యాంకర్స్ కాలనీకి చెందిన యువరాజ్-స్నేహ (21) దంపతులకు 11 నెలల చిన్నారి ఉంది. మంగళవారం వీరు సిరువాపురి
పెరంబూర్(చెన్నై), జూలై 27: స్థానిక మాధవరం పాల డిపో(Milk Depot) సమీపం బ్యాంకర్స్ కాలనీకి చెందిన యువరాజ్-స్నేహ (21) దంపతులకు 11 నెలల చిన్నారి ఉంది. మంగళవారం వీరు సిరువాపురి మురుగన్ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాధవరం రౌండ్ ఠానా సమీపంలో యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుకగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో స్నేహ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా యువరాజ్, 11 నెలల చిన్నారి స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు(Police) కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.