Hyderabad Shocking Incident: సైలెంట్‌గా వచ్చి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-28T23:43:47+05:30 IST

మాదాపుర్ కేబుల్ బ్రిడ్జి (Madhapur) వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా కేబుల్ బ్రిడ్జిపై..

Hyderabad Shocking Incident: సైలెంట్‌గా వచ్చి ఆత్మహత్య

హైదరాబాద్: మాదాపుర్ కేబుల్ బ్రిడ్జి (Madhapur) వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా కేబుల్ బ్రిడ్జిపై నుంచి యువతి దుర్గంచెరువు (Durgam Cheruvu)లోకి దూకింది. తొలుత కేబుల్ బ్రిడ్జి వద్దకు వచ్చిన యువతి హ్యాండ్ బ్యాగ్, చెప్పులు విప్పి ఒక్కసారిగా పై నుంచి కిందకు దూకింది. బ్యాగులో దొరికిన ఆధారాల ప్రకారం యువతి పేరు స్వప్న (Swapna)గా పోలీసులు గుర్తించారు. ఆమె ఈ రోజు ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి (Lb Nagar Kamineni Hospital)లో చికిత్స తీసుకున్నట్లు నిర్ధారించారు. అనారోగ్య సమస్యలే ఆత్మహత్య గల కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం యువతి కోసం గజ ఈతగాళ్లు దుర్గంచెరువులో గాలిస్తున్నారు. 


అయితే విషయం తెలుసుకున్న స్వప్న సోదరి స్పందించారు. కొంతకాలంగా స్వప్న మానసిక సమస్యలతో బాధపడుతుందని తెలిపారు. ‘‘స్వప్నకు వివాహం జరిగింది .అనంతరం విడాకులు కూడా అయ్యాయి. దీంతో ఒంటరి తనంతో మానసికంగా స్వప్న కృంగిపోయింది. గతంలో ఎర్రగడ్డ ఆసుపత్రిలో కూడా చికిత్స చేయించాం. ఇవాళ చికిత్స కోసం ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత ఇంటికి వెళ్తానని చెప్పింది. మా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎల్బీనగర్ నుంచి కేబుల్ బ్రిడ్జి వద్దకు  వెళ్లింది. కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి దుర్గం చెరువులోకి దూకింది.’’ అని చెప్పారు. 




Updated Date - 2022-09-28T23:43:47+05:30 IST