మదనపల్లె మహానాడు దగ్గర జోరు వర్షం

ABN , First Publish Date - 2022-07-07T00:07:45+05:30 IST

మదనపల్లె మహానాడు దగ్గర జోరు వర్షం పడుతోంది. మహానాడుకు భారీగా జనం తరలివచ్చారు. మదనపల్లె బైపాస్‌ రోడ్డు పక్కన

మదనపల్లె మహానాడు దగ్గర జోరు వర్షం

మదనపల్లె: మదనపల్లె మహానాడు దగ్గర జోరు వర్షం పడుతోంది. మహానాడుకు భారీగా జనం తరలివచ్చారు. మదనపల్లె బైపాస్‌ రోడ్డు పక్కన సుమారు 45 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సభకు ప్రజలు కూడా భారీగా తరలివచ్చారు. కాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మహానాడు వచ్చారు. అన్ని అనుకున్నట్లే టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే భారీగా కురిసింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా గ్రౌండ్‌లో జనం నిలుచున్నారు. మరికాసేపట్లో సభా ప్రాంగణానికి చంద్రబాబు రానున్నారు. 


అంతకుముందు మదనపల్లి మహానాడుకు పోలీసుల అడ్డంకులు సృష్టిస్తున్నారు. టీడీపీ శ్రేణులను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. రహదారిపై భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడంతో అక్కడి చేరుకునే ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. టీడీపీ వాహనాలు వెళ్లకుండా మరీ పోలీసులు లారీలకు అనుమతిస్తున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళనకు దిగారు. రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డితో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. 

Updated Date - 2022-07-07T00:07:45+05:30 IST