Bhabanipur: టీఎంసీ ఎమ్మెల్యే ఓటింగ్ మెషీన్‌‌‌ను మూసివేశారు..బీజేపీ అభ్యర్థి ప్రియాంక ఆరోపణ

ABN , First Publish Date - 2021-09-30T15:02:36+05:30 IST

భవానీపూర్ ఉప ఎన్నికల పోలింగ్ పర్వంలో టీఎంసీ నేతలు బూత్ ల ఆక్రమణకు యత్నిస్తున్నారని బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఆరోపించారు...

Bhabanipur: టీఎంసీ ఎమ్మెల్యే ఓటింగ్ మెషీన్‌‌‌ను మూసివేశారు..బీజేపీ అభ్యర్థి ప్రియాంక ఆరోపణ

భవానీపూర్ (పశ్చిమబెంగాల్): భవానీపూర్ ఉప ఎన్నికల పోలింగ్ పర్వంలో టీఎంసీ నేతలు బూత్ ల ఆక్రమణకు యత్నిస్తున్నారని బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఆరోపించారు. గురువారం ఓటింగు ప్రారంభమైన కొన్ని నిమిషాల తర్వాత టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా ఉద్ధేశపూర్వకంగా ఒక పోలింగ్ బూత్ లో ఓటింగు యంత్రాన్ని మూసివేశారని ప్రియాంక ఫిర్యాదు చేశారు.‘‘మదన్ మిత్రా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఓటింగ్ యంత్రాన్ని మూసివేశారు, ఎందుకంటే అతను బూత్‌ను స్వాధీనం చేసుకోవాలనుకున్నారు’’ అని ప్రియాంక గురువారం బూత్ సందర్శన సందర్భంగా చెప్పారు. బెంగాల్ ప్రభుత్వం ఓటమి భయంలో ఉందని బీజేపీ అభ్యర్థి చెప్పారు.‘‘ప్రజలు బయటకు వచ్చి ఓటు వేస్తే, మీరు ఫలితాలు చూస్తారు’’ అని టిబ్రేవాల్ అన్నారు. భవానీపూర్ లో ఉప ఎన్నికల సందర్భంగా భారీ భద్రతతోపాటు 144 సెక్షన్ ను విధించారు. 


Updated Date - 2021-09-30T15:02:36+05:30 IST