మచిలీపట్నం YCPలో విభేదాలు

ABN , First Publish Date - 2022-06-11T01:00:14+05:30 IST

మచిలీపట్నం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్నినాని మధ్య వర్గపోరు నడుస్తోంది.

మచిలీపట్నం YCPలో విభేదాలు

కృష్ణా: మచిలీపట్నం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్నినాని మధ్య వర్గపోరు నడుస్తోంది. పార్టీ కోసం పనిచేసినా బాలశౌరి ప్రాధాన్యతివ్వడం లేదంటూ.. పేర్నినాని అనుచరుడు అజ్గర్‌ వర్గీయుల ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. బాలశౌరి పర్యటనను అజ్గర్‌ వర్గీయులు అడ్డుకున్నారు. బాలశౌరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం జగన్ చెప్పారనే బాలశౌరిని గెలిపించామని అజ్గర్ అంటున్నాడు. బాలశౌరి తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-06-11T01:00:14+05:30 IST