ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మచిలీపట్నం విద్యార్థులు

ABN , First Publish Date - 2022-02-27T02:11:58+05:30 IST

మచిలీపట్నం డివిజన్‌కు సంబంధించి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల సంఖ్య

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మచిలీపట్నం విద్యార్థులు

మచిలీపట్నం: మచిలీపట్నం డివిజన్‌కు సంబంధించి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల సంఖ్య క్రమం క్రమంగా పెరుగుతోంది. ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో  ఏర్పాటు చేసిన కంట్రోల్ రూముకు విద్యార్థుల సమాచారాన్ని వారి తల్లిదండ్రులు తెలియజేస్తున్నారని ఆర్డీఓ తెలిపారు. ఉదయం ముగ్గురు విద్యార్థుల వివరాలు కంట్రోల్ రూముకు అందాయన్నారు. కానీ సాయంత్రానికి 14 మంది విద్యార్థుల సమాచారాన్ని వారి తల్లిదండ్రులు అందజేశారని ఆర్డీఓ ఖాజావలీ పేర్కొన్నారు. మచిలీపట్నంకు చెందిన ఏడుగురు, పెడనలో ఇద్దరు, మొవ్వలో ఇద్దరు, చల్లపల్లిలో ఒకరు, కృత్తివెన్నులో ఒకరు, బంటుమిల్లిలో ఒకరు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారని ఆయన తెలపారు. వీరందరి సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేసి స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్డీఓ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-27T02:11:58+05:30 IST