మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమారుడిపై హత్యాయత్నం
ABN , First Publish Date - 2020-10-30T17:51:33+05:30 IST
జిల్లాలోని మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమారుడిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పింటించారు.
కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమారుడిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పింటించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంట్లోనే ఘటన జరగటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాలా..? రాజకీయ కారణాలా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.