మద్యం మత్తులోనే మంత్రిపై దాడి: సీఐ

ABN , First Publish Date - 2020-11-29T18:48:09+05:30 IST

ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడికి సంబంధించిన వివరాలను సీఐ వెంకట నారాయణ వెల్లడించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన..

మద్యం మత్తులోనే మంత్రిపై దాడి: సీఐ

మచిలీపట్నం: ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడికి సంబంధించిన వివరాలను సీఐ వెంకట నారాయణ వెల్లడించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. చెమ్మన్నగిరి పేటకు చెందిన బడుగు నాగేశ్వరరావు దాడికి పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. మద్యం మత్తులో ఉన్నట్లుగా గుర్తించామని.. నాగేశ్వరరావు నేర చరిత్రపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. నిందితుడిపై మంత్రి అనుచరులు ఫిర్యాదు చేశారని... పార్టీలకు సంబంధం ఉందా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.


సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై నాగేశ్వరరావు అనే మేస్త్రీ తాపీతో దాడికి యత్నించాడు. అయితే ఆయన అనుచరులు వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో మంత్రి క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. 

Updated Date - 2020-11-29T18:48:09+05:30 IST