AP News: మచిలీపట్నంలో బాలిక కిడ్నాప్.. అత్యాచారం
ABN , First Publish Date - 2022-08-14T22:54:55+05:30 IST
మచిలీపట్నం (Machilipatnam)లో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలిక కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.
కృష్ణా: మచిలీపట్నం (Machilipatnam)లో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలిక కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఒక నిందితుడు అరెస్ట్ (arrest) చేశారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు బైక్పై వచ్చి బలవంతంగా తీసుకెళ్లారని బాలిక బంధువులు తెలిపారు. వంతెన కిందకి తీసుకెళ్లి హింసించి బలాత్కారం చేశారని చెబుతున్నారు. ఒక యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించామని, పోలీసులు ఇంతవరకు రెండో నిందితుడిని పట్టుకోలేదని తెలిపారు. తమకు న్యాయం జరగలేదని వాపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు కోరుతున్నారు.