‘మాజా’ కోసం అమితాబ్, పూజాహెగ్డే

ABN , First Publish Date - 2022-01-29T05:25:14+05:30 IST

కోకాకోలా దేశీయంగా అభివృద్ధి చేసిన మామిడి పానీయం మాజా ‘దిల్‌దార్‌ బనే దే’ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తోంది.

‘మాజా’ కోసం అమితాబ్, పూజాహెగ్డే

హైదరాబాద్‌: కోకాకోలా దేశీయంగా అభివృద్ధి చేసిన మామిడి పానీయం మాజా ‘దిల్‌దార్‌ బనే దే’ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తోంది. ఈ ప్రచార కార్యక్రమం కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని టీవీ, డిజిటల్‌, రేడియోలో 360 డిగ్రీ విధానంతో ప్రసారం చేయనున్నారు.


ఈ నూతన ప్రచారం విడుదల సందర్భంగా కోకా కోలా ఇండియా అండ్ సౌత్‌ వెస్ట్‌ ఆసియా మార్కెటింగ్ డైరెక్టర్ అజయ్‌ కొనాలీ మాట్లాడుతూ ‘‘మన దేశపు వారసత్వ బ్రాండ్‌ మాజా. 1976 నుంచి ఇది భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే మ్యాంగో డ్రింక్‌గా వెలుగొందుతూ బ్రాండ్‌గా నిలిచింది. మామిడి పళ్ల రుచికి మాజా సుప్రసిద్ధం. మామిడి విభాగంలో సుప్రసిద్ధమైన బ్రాండ్‌ ఇది. ’’ అని అన్నారు.


పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘నా చిన్నతనం నుంచి కూడా నాకు ఇష్టమైన బ్రాండ్‌కు పనిచేసే అవకాశం లభించడం ఓ అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రచారం నా హృదయానికి దగ్గరగా ఉంది. అంతేకాదు, నా అభిమాన నటుడు, స్ఫూర్తిప్రదాత అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే ప్రత్యేక అవకాశం కూడా నాకు లభించింది. అలాగే హిందీ సినిమాలో మహోన్నత దర్శకులలో ఒకరైన షూజిత్‌ సర్కార్‌తో కలిసి పని చేసే అవకాశం కూడా లభించింది. ’’ అని అన్నారు.



Updated Date - 2022-01-29T05:25:14+05:30 IST