కలకత్తా కాళి ఎవరు?.. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు అమ్మవారిని ఎలా పూజించేవారంటే..

ABN , First Publish Date - 2022-07-07T14:42:42+05:30 IST

కాళి ప్రస్తావన మహాభారతంలో ఉంది...

కలకత్తా కాళి ఎవరు?.. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు అమ్మవారిని ఎలా పూజించేవారంటే..

కాళి ప్రస్తావన మహాభారతంలో ఉంది. బెంగాల్‌లో కాళి ప్రధాన శక్తి దేవత. బెంగాల్‌లో సుభాష్ చంద్రబోస్ నుండి దాదాపు ప్రతి నాయకుడు ఆమెను ఆరాధిస్తుంటారు. అక్కడ కాళీపై ఇతిహాసాలు, కావ్యాలు రచించారు. ఆమె శౌర్య పరాక్రమాలకు సంబంధించిన కథలన్నీ పురాణాలలో ఉన్నాయి. దేశంలో కాళీమాతను తంత్ర మంత్రానికి దేవతగా భావిస్తారు. చెడులతో పోరాడే శక్తిగా కూడా భావిస్తారు. ఆమె పార్వతిదేవి అవతారం, శివుడు, శక్తికి ప్రతిరూపం. 


కోల్‌కతాలోని బరాక్‌పూర్‌లోని దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం అత్యంత ప్రసిద్ధ కాళీ దేవాలయాలలో ఒకటి. ఇది చరిత్రాత్మకం. దేవాలయంలో ప్రధాన దేవత భవతారిణి. కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయం తర్వాత ఇది అత్యంత ప్రసిద్ధ కాళీ దేవాలయం. దీనిని 1854లో జాన్ బజార్‌కు చెందిన రాణి రాసమణి నిర్మించారు. స్వామి రామకృష్ణ పరమహంస, వివేకానంద ఈ ఆలయంలో అమ్మవారికి పూజలు చేసేవారు. స్వామి రామకృష్ణ 1857-68 సంవత్సరాల మధ్య ఈ ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. అప్పుడు అది అతనికి ఆధ్యాత్మిక ప్రదేశంగా మారింది. వివేకానందుడు కాళీ ఆరాధకుడు. ఒక రోజు  రామకృష్ణ వద్దకు చేరుకుని ఉద్యోగం కోసం తనపై ఉన్న ఒత్తిడి గురించి, తన కుటుంబ పరిస్థితిని చెబుతూ మార్గం చూపాలని అడిగాడు. వెంటనే రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ..  కాళీమాత వద్దకు వెళ్లి కుటుంబ ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని కోరుకోమన్నారు. వివేకానందుడు అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్లి ఆమె మాతృ స్వరూపాన్ని చూసి భక్తితో నిండిపోయాడు. తన సమస్యలను తీర్చాలని కోరలేదు. దీనిని గమనించిన రామకృష్ణ పరమహంస వారి కుటుంబానికి ఎప్పుడూ తిండికి, బట్టకు కొరత రాకూడదని ఆశీర్వదించాడు. రామకృష్ణ పరమహంస తన జీవితంలో ఎక్కువ భాగం కాళి అమ్మవారి భక్తునిగా గడిపారు. అమ్మవారిపై భక్తి అతనిలో ప్రబలంగా ఉన్నప్పుడు ఆనందంగా నాట్యం చేసేవారు.

Updated Date - 2022-07-07T14:42:42+05:30 IST