శివ బాలాజీకి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
ABN , First Publish Date - 2021-10-10T23:27:43+05:30 IST
మా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గెలుపు ఎవరివారు ధీమాగా ఉన్నారు. ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచి విష్ణు ప్యానళ్ల..
హైదరాబాద్: ‘మా’ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గెలుపుపై ఎవరికివారు ధీమాగా ఉన్నారు. ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచి విష్ణు ప్యానళ్ల మధ్య పోటీ నెలకొంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో కౌంటింగ్ జరుగుతోంది. మురళీమోహన్, మోహన్ బాబు సమక్షంలో ఓట్లను లెక్కిస్తున్నారు.
అయితే శివబాలాజీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను గౌతంరాజు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శివబాలాజీ మంచు విష్ణు ప్యానల్ తరపున పోటీ చేశారు. హేమ పంటి కాటు కారణంగానే శివబాలాజీ అస్వస్థతకు గురయ్యారని కొందరంటే.. మరికొందరు పంటికాటుతో విషమెక్కిందని జోకులు వేస్తున్నారు. హేమను విషకన్యగా పోలుస్తూ కొన్ని మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఈ ఉదయం శివబాలాజీ చేతిని హేమ కొరికారు. చికిత్స కోసం శివబాలాజీ నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నట్లు శివబాలాజీ తెలిపారు. హేమ తన చేతికి ఎందుకు కొరికిందో తనకు తెలియడం లేదన్నారు. తన చేతికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు శివబాలాజీ చెప్పారు.